ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!
- February 13, 2025
మస్కట్: 8వ హిందూ మహాసముద్ర సదస్సు (ఐఓసీ) కార్యకలాపాలు ఫిబ్రవరి 16న మస్కట్లో ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల ఈవెంట్ను ఒమన్ నిర్వహిస్తుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాతినిధ్యం వహిస్తుంది. "వోయేజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మారిటైమ్ పార్టనర్షిప్" అనే థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ తెలిపారు. విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసాయిదీ సదస్సును ప్రారంభిస్తారని, 60 దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సదస్సుకు ఒమన్ ఆతిథ్యమివ్వడం హిందూ మహాసముద్రం ద్వారా దాని చరిత్ర, సముద్ర సంబంధాలను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. ఒమానీలు వందల సంవత్సరాలు సముద్రంలో ప్రయాణించి చైనా, భారతదేశం, తూర్పు ఆఫ్రికాకు చేరుకున్న నావికులు అని గుర్తుచేశారు. ఈ మహాసముద్రంపై ఆసక్తి ఉన్న దేశాలతో పాటు హిందూ మహాసముద్రం సరిహద్దులో ఉన్న దేశాల మధ్య వివిధ ఆర్థిక మరియు భద్రతా అంశాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సదస్సు లక్ష్యం అని అల్ హార్తీ తెలిపారు. దేశాల మధ్య సహకార విధానాలను అభివృద్ధి చేయడం, ఆర్థిక ప్రయోజనాలను పెంపొందించడం, సముద్ర వనరులను కాపాడుకోవడం, రవాణా మరియు సముద్ర భద్రతా సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశాలని షేక్ అల్ హార్తీ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ రామ్ మాధవ్ పాల్గొన్నారు. హిందూ మహాసముద్రం 3 బిలియన్ల జనాభా కలిగిన 36 దేశాలలో విస్తరించిందని, 70 శాతం సముద్ర వాణిజ్యం ఈ సముద్రం గుండానే సాగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్