ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- February 13, 2025
మనామా: గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా అరద్లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి రెస్టారెంట్, కమర్షియల్ స్టోర్ ఉన్న భవనం ధ్వంసమైంది. బుధవారం రాత్రి 7:40 గంటలకు ప్రమాదం సంభవించింది. పబ్లిక్ సెక్యూరిటీ డిప్యూటీ చీఫ్ మేజర్ జనరల్ డాక్టర్ షేక్ హమద్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ..ప్రమాదంలో ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారిని కింగ్ హమద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, ప్రత్యక్ష సాక్షులు పేలుడు తర్వాత జరిగిన విధ్వంసాన్ని వివరించారు. “మేము ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద పేలుడు వినిపించింది. ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి మేము బయటికి పరుగెత్తాము. ఒక భవనం పూర్తిగా కుప్పకూలడం దిగ్భ్రాంతి కలిగించింది.’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించారు. “మేము ప్రధాన రహదారికి చేరుకున్నాము. శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నించాము. కూలిపోయిన భవనం , గాయపడిన వారిని చూశాము. సివిల్ డిఫెన్స్ సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండడం తప్ప మేం ఏమీ చేయలేకపోయాం.’’ అని మరోకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







