140 కోట్లకు మహేష్ బాబు సినిమా రైట్స్ కైవసం చేసుకోనున్న రిలయన్స్
- July 02, 2016
ప్రిన్స్ మహేష్ బాబుకి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఇది మహేష్ బాబు కి ఏ మాత్రం నష్టం చేకూర్చేది కాదు. మహేష్ బాబు ని సైతం షాక్ అయ్యేలా చేసిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అసలు ఏం చేసిందనేది ఇప్పుడు ఓ సారి చూద్దాం. బ్రహ్మోత్సవం పరాజయం తరువాత మహేష్ బాబు చేస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించని స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పక్కాగా రెడీ అయ్యాయి. ఇక జూలై నెల మధ్యలో ఈ సినిమాని మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సైతం ముహుర్తం పెట్టుకుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ కాంబినేషన్ సైతం నేషనల్ మార్కెట్ లో వాల్యూ పెంచేలా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా నటిస్తుంది.
అలాగే దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ పెరగటంతో...ఈ మూవీ మార్కెట్ పై కార్పోరేట్ సంస్థల కన్ను పడింది.
ఆ విధంగా రిలయన్స్ ఎంర్టైన్మెంట్ సంస్థ...ఈ మూవీ నిర్మాతలతో చర్ఛలు జరిపి దాదాపు 140 కోట్ల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో థియోటర్స్ రైట్స్, డిజిటల్ రైట్స్ ని రిలయన్స్ చేజిక్కించుకుందని అంటున్నారు. ఈ డీల్ వివరాలను తెలుసుకున్న మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









