140 కోట్లకు మహేష్ బాబు సినిమా రైట్స్ కైవసం చేసుకోనున్న రిలయన్స్
- July 02, 2016
ప్రిన్స్ మహేష్ బాబుకి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఇది మహేష్ బాబు కి ఏ మాత్రం నష్టం చేకూర్చేది కాదు. మహేష్ బాబు ని సైతం షాక్ అయ్యేలా చేసిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అసలు ఏం చేసిందనేది ఇప్పుడు ఓ సారి చూద్దాం. బ్రహ్మోత్సవం పరాజయం తరువాత మహేష్ బాబు చేస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనుందనే విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించని స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పక్కాగా రెడీ అయ్యాయి. ఇక జూలై నెల మధ్యలో ఈ సినిమాని మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సైతం ముహుర్తం పెట్టుకుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ కాంబినేషన్ సైతం నేషనల్ మార్కెట్ లో వాల్యూ పెంచేలా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా నటిస్తుంది.
అలాగే దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ పెరగటంతో...ఈ మూవీ మార్కెట్ పై కార్పోరేట్ సంస్థల కన్ను పడింది.
ఆ విధంగా రిలయన్స్ ఎంర్టైన్మెంట్ సంస్థ...ఈ మూవీ నిర్మాతలతో చర్ఛలు జరిపి దాదాపు 140 కోట్ల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో థియోటర్స్ రైట్స్, డిజిటల్ రైట్స్ ని రిలయన్స్ చేజిక్కించుకుందని అంటున్నారు. ఈ డీల్ వివరాలను తెలుసుకున్న మహేష్ బాబు ఒక్కసారిగా షాక్ అయ్యాడని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







