అమెరికా, బ్రిటన్ ఎయిర్ పోర్ట్ ల మీద కూడా దాడి చేస్తాం: ఐఎస్ఐఎస్
- July 02, 2016
అమెరికాను, బ్రిటన్ ను కూడా వదలబోమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థకు మద్దతిచ్చేలా ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ బెదిరింపులు వెల్లడయ్యాయి. లాస్ ఎంజెల్స్ ఇంటర్నేషనల్, జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్, లండన్ లోని హ్యాత్రూ ఇంటర్నేషనల్ విమానాశ్రయంపైన, విమానాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐసిస్ హెచ్చరించింది. ఈ నెల (జూలై 4)న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల కాలంలో ఓర్లాండో ఘటన, తర్వాత టర్కీలోని ఇస్తాంబుల్, తాజాగా ఢాకాలో ఐసిస్ ఘటనలు చోటుచేసుకోగా.. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలో ఈ దాడుల ప్రణాళిక విఫలమైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మధ్య ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఐసిస్ తన పడగ విప్పుతునే ఉంది. తాజాగా మరోసారి అమెరికాకు, బ్రిటన్ కు ఈ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో ఆ దేశాలు ముందస్తు జాగ్రత్తకు దిగాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







