అమెరికా, బ్రిటన్ ఎయిర్ పోర్ట్ ల మీద కూడా దాడి చేస్తాం: ఐఎస్ఐఎస్
- July 02, 2016
అమెరికాను, బ్రిటన్ ను కూడా వదలబోమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ సంస్థకు మద్దతిచ్చేలా ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ బెదిరింపులు వెల్లడయ్యాయి. లాస్ ఎంజెల్స్ ఇంటర్నేషనల్, జాన్ ఎఫ్ కెన్నడీ ఇంటర్నేషనల్, లండన్ లోని హ్యాత్రూ ఇంటర్నేషనల్ విమానాశ్రయంపైన, విమానాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని ఓ ట్విట్టర్ ఖాతా ద్వారా ఐసిస్ హెచ్చరించింది. ఈ నెల (జూలై 4)న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల కాలంలో ఓర్లాండో ఘటన, తర్వాత టర్కీలోని ఇస్తాంబుల్, తాజాగా ఢాకాలో ఐసిస్ ఘటనలు చోటుచేసుకోగా.. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలో ఈ దాడుల ప్రణాళిక విఫలమైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మధ్య ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఐసిస్ తన పడగ విప్పుతునే ఉంది. తాజాగా మరోసారి అమెరికాకు, బ్రిటన్ కు ఈ దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడంతో ఆ దేశాలు ముందస్తు జాగ్రత్తకు దిగాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









