అమర్ నాథ్ యాత్రీకులకు బీఎస్ఎన్ఎల్ వారి "స్పెషల్ యాత్రా సిమ్ కార్డ్స్"
- July 02, 2016
అమర్ నాథ్ యాత్రికుల కోసం జమ్మూకశ్మీర్ బీఎస్ఎన్ఎల్ "స్పెషల్ యాత్రా సిమ్ కార్డ్స్"లను ప్రవేశపెట్టింది. దక్షిణ కశ్మీరంలో పటిష్ట భద్రత నడుమ 48 రోజులపాటుసాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. యాత్రికుల కమ్యూనికేషన్ అవసరాల నేపథ్యంలో ఈ స్పెషల్ యాత్ర సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించినట్టు పీఐబీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.బాల్తాల్, చందన్ వారీ నుంచి పవిత్ర గుహ వరకు మొబైల్ కనెక్టివిటీ ఉండేలా.. ఈ ప్రత్యేక కార్యక్రమం కింద బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన సిమ్ కార్డులను ప్రవేశపెట్టిందని అధికారి చెప్పారు. లకన్ పుర్ బోర్డర్, భగవతి నగర్ బేస్ క్యాంపుల్లో ఈ స్పెషల్ యాత్రా సిమ్ కార్డులు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా బాల్టాల్, చందన్ వారీ ఔట్ లెట్స్ లో ఈ సిమ్ లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ సిమ్ కార్డు ద్వారా ఉచిత టాక్ టైమ్, ఆకర్షణీయమైన కాల్ చార్జీలు, ఏడు రోజుల ఉచిత డేటా వంటి సదుపాయాలను యాత్రికులు పొందవచ్చని ప్రతినిధి తెలిపారు. బేస్ క్యాంప్ భగవతి నగర్ జమ్మూలో యాత్రికుల కోసం స్పెషల్ కస్టమర్ సర్వీసు సెంటర్ ను రూపొందించారు. హెల్ప్ లైన్ నెంబర్ గా 0191-2555556 ఉంచినట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









