ముంబై నుంచి దుబాయ్‌ ఫ్లైట్ లో సాంకేతిక లోపం..

- February 19, 2025 , by Maagulf
ముంబై నుంచి దుబాయ్‌ ఫ్లైట్ లో సాంకేతిక లోపం..

ముంబై: ముంబై నుంచి దుబాయ్‌ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలోనే అత్యవసరంగా దిగింది. గత రాత్రి 8 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా ఈ తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది.

అయితే, మార్గమధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 50 నిమిషాల ప్రయాణం అనంతరం తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.దీంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ విమానంలో పలువురు తెలుగు ప్రయాణికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com