కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు..ఇక వడ్డీ లేని వాయిదాలలో చెల్లింపు..!!
- February 20, 2025
అబుదాబి: అబుదాబి న్యాయ శాఖ (ADJD) కోర్టు ఫీజులు, అమలు మొత్తాలు, లాయర్ ఖర్చులు, నోటరీ ఫీజుల కోసం వడ్డీ రహిత వాయిదాల సేవను ప్రారంభించింది. పిటిషన్ దారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఇది కీలక సంస్కణగా భావిస్తున్నారు. ఈ సర్వీస్ కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫీజులు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార రుసుములతో పాటు న్యాయవాదులు, నిపుణులు, నోటరీ సేవలు, ADJD సేవలకు సంబంధించిన సబ్స్క్రిప్షన్లతో సహా అన్ని లిటిగేషన్-సంబంధిత రుసుములను కవర్ చేస్తుందని తెలిపారు.
"నిర్మాణాత్మక, వడ్డీ రహిత చెల్లింపు ప్రణాళికను ప్రవేశపెట్టడం ద్వారా, మేము వ్యాజ్యానికి ప్రధాన ఆర్థిక అవరోధాన్ని తొలగిస్తున్నాము. ఖర్చు పరిగణనలు న్యాయస్థానాలను యాక్సెస్ చేయడానికి ఆటంకం కలిగించవని నిర్ధారిస్తున్నాము." అని ADJD అండర్ సెక్రటరీ కౌన్సెలర్ యూసఫ్ సయీద్ అల్ అబ్రి అన్నారు. ఈ సేవ అబుదాబిలో పెట్టుబడులు, వాణిజ్య రంగాలకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా వ్యక్తులు, వ్యాపారాల కోసం ఆర్థిక లిక్విడిటీని నిర్వహించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అబుదాబిలోని న్యాయ నిపుణులు ఈ చర్యను స్వాగతించారు. వ్యాజ్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చే ప్రగతిశీల సంస్కరణగా దీనిని అభివర్ణించారు. కుటుంబ చట్టాల కేసుల్లో సంస్కరణ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









