చిరంజీవి మ్యారేజ్ డే.. మహేష్ బాబు పై ఫన్నీ కామెంట్స్
- February 20, 2025
మెగాస్టార్ చిరంజీవి మ్యారేజ్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా నేలపై కాదు. గాలిలో..యస్..ఆయన మ్యారేజ్ యానివర్సరీని స్పెషల్ ఫ్లైట్ లో జరుపుకున్నారు. అలా ఫ్లైట్ లో సెలబ్రేట్ చేసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ పార్టీ జరుపుకోబోతున్నారు. అయితే ఈ పార్టీకి తన డియరెస్ట్ ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఫ్లైట్ లో ఉన్న సెలబ్రిటీస్ ను చూసి నెటిజన్స్ అంతా మహేష్ బాబుపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా.. సింపుల్. ఆ ఫ్లైట్ లో మహేష్ వైఫ్ నమ్రత ఉంది. కానీ అతను లేడు. మెగాస్టార్ తో పాటు అక్కినేని నాగార్జున, అమలతో పాటు నమ్రత కూడా ఉంది. అయితే మహేష్ బాబు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అంతా రాజమౌళి గురించి చెబుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తీసుకున్నాడు కదా. అప్పటి నుంచి అది అతని వద్దే ఉందేమో.. ఈ ట్రిప్ కు పాస్ పోర్ట్ ఇవ్వలేదేమో అందుకే మహేష్ ఈ ఫ్లైట్ లేడు అంటున్నారు. ఇంకొందరు పాపం నీకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదన్నా అంటూ మహేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే నిజంగానే ఈ ఫ్లైట్ లో మహేష్ లేడా లేక.. ఆయన లుక్ బయటకు వస్తుందని ఫోటోస్ లో స్కిప్ చేశారా అనేది తెలియదు కానీ.. కామెంట్స్ అయితే ఫన్నీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







