చిరంజీవి మ్యారేజ్ డే.. మహేష్ బాబు పై ఫన్నీ కామెంట్స్
- February 20, 2025
మెగాస్టార్ చిరంజీవి మ్యారేజ్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా నేలపై కాదు. గాలిలో..యస్..ఆయన మ్యారేజ్ యానివర్సరీని స్పెషల్ ఫ్లైట్ లో జరుపుకున్నారు. అలా ఫ్లైట్ లో సెలబ్రేట్ చేసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ పార్టీ జరుపుకోబోతున్నారు. అయితే ఈ పార్టీకి తన డియరెస్ట్ ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఫ్లైట్ లో ఉన్న సెలబ్రిటీస్ ను చూసి నెటిజన్స్ అంతా మహేష్ బాబుపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా.. సింపుల్. ఆ ఫ్లైట్ లో మహేష్ వైఫ్ నమ్రత ఉంది. కానీ అతను లేడు. మెగాస్టార్ తో పాటు అక్కినేని నాగార్జున, అమలతో పాటు నమ్రత కూడా ఉంది. అయితే మహేష్ బాబు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అంతా రాజమౌళి గురించి చెబుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తీసుకున్నాడు కదా. అప్పటి నుంచి అది అతని వద్దే ఉందేమో.. ఈ ట్రిప్ కు పాస్ పోర్ట్ ఇవ్వలేదేమో అందుకే మహేష్ ఈ ఫ్లైట్ లేడు అంటున్నారు. ఇంకొందరు పాపం నీకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదన్నా అంటూ మహేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే నిజంగానే ఈ ఫ్లైట్ లో మహేష్ లేడా లేక.. ఆయన లుక్ బయటకు వస్తుందని ఫోటోస్ లో స్కిప్ చేశారా అనేది తెలియదు కానీ.. కామెంట్స్ అయితే ఫన్నీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









