చిరంజీవి మ్యారేజ్ డే.. మహేష్ బాబు పై ఫన్నీ కామెంట్స్
- February 20, 2025
మెగాస్టార్ చిరంజీవి మ్యారేజ్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా నేలపై కాదు. గాలిలో..యస్..ఆయన మ్యారేజ్ యానివర్సరీని స్పెషల్ ఫ్లైట్ లో జరుపుకున్నారు. అలా ఫ్లైట్ లో సెలబ్రేట్ చేసుకుని దుబాయ్ వెళ్లి అక్కడ పార్టీ జరుపుకోబోతున్నారు. అయితే ఈ పార్టీకి తన డియరెస్ట్ ఫ్రెండ్స్ ను కూడా తీసుకువెళ్లాడు. ఆ క్రమంలో ఫ్లైట్ లో ఉన్న సెలబ్రిటీస్ ను చూసి నెటిజన్స్ అంతా మహేష్ బాబుపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా.. సింపుల్. ఆ ఫ్లైట్ లో మహేష్ వైఫ్ నమ్రత ఉంది. కానీ అతను లేడు. మెగాస్టార్ తో పాటు అక్కినేని నాగార్జున, అమలతో పాటు నమ్రత కూడా ఉంది. అయితే మహేష్ బాబు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ అంతా రాజమౌళి గురించి చెబుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తీసుకున్నాడు కదా. అప్పటి నుంచి అది అతని వద్దే ఉందేమో.. ఈ ట్రిప్ కు పాస్ పోర్ట్ ఇవ్వలేదేమో అందుకే మహేష్ ఈ ఫ్లైట్ లేడు అంటున్నారు. ఇంకొందరు పాపం నీకు వచ్చిన కష్టం ఇంకెవరికీ రాకూడదన్నా అంటూ మహేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే నిజంగానే ఈ ఫ్లైట్ లో మహేష్ లేడా లేక.. ఆయన లుక్ బయటకు వస్తుందని ఫోటోస్ లో స్కిప్ చేశారా అనేది తెలియదు కానీ.. కామెంట్స్ అయితే ఫన్నీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









