ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం
- February 20, 2025
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమం త్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తా తో లెఫ్ట్ నేంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా,కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళ లకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తా మని ప్రకటించారు. మార్చి 8 లోపు నగదు జమ అవుతుందని, రేఖా గుప్తా చెప్పారు.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ శీశ్ మహాల్ ను మ్యూ జియంగా మారుస్తామని చెప్పారు. ఆప్ ప్రభుత్వ పాలనను విమర్శించన రేఖా గుప్తా ప్రతి పైసాకు ఆప్ ఢిల్లీ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు.
ఇక మీదట తాను ప్రజల మధ్యే ఉంటానని..నా బాధ్యతను నేను అత్యంత నిజాయితీగా నెరవేరుస్తా నని చెప్పుకొచ్చారు. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని..నాపై నమ్మ కం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతను నాకు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ హైకమాం డ్కు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









