తెలుగులోకి వస్తున్న తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్..
- February 21, 2025
మహత్ రాఘవేంద్ర, దేవిక, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ఎమోజీ. సెన్ రంగసామీ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఈ తమిళ రొమాంటిక్ సిరీస్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్సిరీస్ను అదే పేరుతో స్ట్రీమింగ్ చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది.
తమిళంలో విడుదలైన రెండు సంవత్సరాల తెలుగులో వస్తుంది. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి ఎలా దారి తీసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో ఆ యువకుడు ఎందుకు జీవించాలని అనుకున్నాడు?
ఆ తరువాత విడాకులు తీసుకున్న అమ్మామే మళ్లీ అతడి జీవితంలోకి ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్తో ఈ వెబ్సిరీస్ను రూపొందించారు. తమిళంలో ఈ వెబ్సిరీస్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
కాగా..ఈ వెబ్సిరీస్ నటించిన మానస చౌదరి తెలుగు అమ్మాయి కావడం విశేషం. బబుల్గమ్ చిత్రంతో అమ్మడు టాలీవుడ్లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సుమ కనకాల కొడుకు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో నటించింది మానస.
తాజా వార్తలు
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!







