తెలుగులోకి వస్తున్న తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్..
- February 21, 2025
మహత్ రాఘవేంద్ర, దేవిక, మానస చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్సిరీస్ ఎమోజీ. సెన్ రంగసామీ ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఈ తమిళ రొమాంటిక్ సిరీస్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ వెబ్సిరీస్ను అదే పేరుతో స్ట్రీమింగ్ చేయనుంది. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది.
తమిళంలో విడుదలైన రెండు సంవత్సరాల తెలుగులో వస్తుంది. ఓ జంట మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి ఎలా దారి తీసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చి మరో అమ్మాయితో ఆ యువకుడు ఎందుకు జీవించాలని అనుకున్నాడు?
ఆ తరువాత విడాకులు తీసుకున్న అమ్మామే మళ్లీ అతడి జీవితంలోకి ఎలా వచ్చింది? అనే కాన్సెప్ట్తో ఈ వెబ్సిరీస్ను రూపొందించారు. తమిళంలో ఈ వెబ్సిరీస్ మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
కాగా..ఈ వెబ్సిరీస్ నటించిన మానస చౌదరి తెలుగు అమ్మాయి కావడం విశేషం. బబుల్గమ్ చిత్రంతో అమ్మడు టాలీవుడ్లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సుమ కనకాల కొడుకు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో నటించింది మానస.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







