అమెరికా ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గింపు...
- February 23, 2025
అమెరికా: ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. అయితే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా, లోకల్ తయారీ కంపెనీలకు ఎటువంటి నష్టం కలగని ప్రొడక్ట్ లపైనే సుంకాలు తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సుంకాలు తగ్గించినా లోకల్ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదనుకునే ప్రొడక్ట్ లను గుర్తించే పనిలో విధ మినిస్ట్రీలు ఉన్నాయి.
భారత్, అమెరికా దేశాల మధ్య కురదబోయే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ)లో భాగంగా యూఎస్ నుంచి దిగుమతులను ఇండియా పెంచనుంది. ఇటీవల బీటీఏ చర్చల్లో ఇరుదేశాలుకూడా వ్యాపారాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లుకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యాపారంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. ఇందులోనూ తక్కువ వాల్యూమ్ లో జరిగే దిగుమతులపైనే ఎక్కువగా సుంకాలను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఆటో మొబైల్, ఆటో కాంపోనెంట్స్ వంటి సెక్టార్లలోని కంపెనీలతో చర్చ జరుపుతోంది. మరోవైపు వ్యవసాయ రంగం నష్టపోకుండా చూసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది.
ప్రస్తుతం ఇండియా నుంచి ఏడాదికి రూ.1.2లక్షల కోట్ల విలువైన వెహికల్ పార్టులు యూఎస్ కు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని వేయడం లేదు. అదే ఇండియా చేసుకుంటున్న ఆటో పోర్టుల దిగమతులపై 5శాతం నుంచి 15శాతం వరకు డ్యూటీ పడుతోంది. బీటీఏ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









