అమెరికా ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గింపు...
- February 23, 2025
అమెరికా: ఇండియాపై పరస్పర టారిఫ్ లు కచ్చితంగా వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మరికొన్ని అమెరికా ప్రొడక్ట్ లపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. అయితే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా, లోకల్ తయారీ కంపెనీలకు ఎటువంటి నష్టం కలగని ప్రొడక్ట్ లపైనే సుంకాలు తగ్గించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సుంకాలు తగ్గించినా లోకల్ కంపెనీలకు ఎటువంటి నష్టం ఉండదనుకునే ప్రొడక్ట్ లను గుర్తించే పనిలో విధ మినిస్ట్రీలు ఉన్నాయి.
భారత్, అమెరికా దేశాల మధ్య కురదబోయే బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ)లో భాగంగా యూఎస్ నుంచి దిగుమతులను ఇండియా పెంచనుంది. ఇటీవల బీటీఏ చర్చల్లో ఇరుదేశాలుకూడా వ్యాపారాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లుకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య జరుగుతున్న వ్యాపారంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ. ఇందులోనూ తక్కువ వాల్యూమ్ లో జరిగే దిగుమతులపైనే ఎక్కువగా సుంకాలను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఆటో మొబైల్, ఆటో కాంపోనెంట్స్ వంటి సెక్టార్లలోని కంపెనీలతో చర్చ జరుపుతోంది. మరోవైపు వ్యవసాయ రంగం నష్టపోకుండా చూసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టనుంది.
ప్రస్తుతం ఇండియా నుంచి ఏడాదికి రూ.1.2లక్షల కోట్ల విలువైన వెహికల్ పార్టులు యూఎస్ కు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అమెరికా ఎటువంటి ఇంపోర్ట్ డ్యూటీని వేయడం లేదు. అదే ఇండియా చేసుకుంటున్న ఆటో పోర్టుల దిగమతులపై 5శాతం నుంచి 15శాతం వరకు డ్యూటీ పడుతోంది. బీటీఏ చర్చల్లో ఇరు దేశాల ప్రతినిధులు ఈ అంశంపై చర్చించారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









