యూఏఈలో గోల్డ్ కొనుగోలు, లీజింగ్ కోసం కొత్త యాప్..!!
- February 27, 2025
యూఏఈ: యూఏఈ బేస్డ్ యాప్.. నివాసితులు బంగారాన్ని Dh1 కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. కొనుగోలుదారులు తమ బంగారాన్ని లీజుకు ఇచ్చి, దాని నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని అందించే కొత్త సేవను ప్రారంభించింది. O గోల్డ్ యాప్ దాని వినియోగదారులను కేవలం 0.1 గ్రాముల బంగారాన్ని లీజుకు తీసుకోవడానికి, వారు కలిగి ఉన్న బంగారం నుండి 16 శాతం వార్షిక ఆదాయాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. ఈ అవకాశాన్ని అందించడానికి గోల్డ్ లీజింగ్ మానిటరీ మెటల్స్ (MM)లో గ్లోబల్ లీడర్తో యాప్ ఒప్పందం చేసుకుంది. MM-దుబాయ్ సీఈఓ మార్క్ పే దీనిని యూఏఈ నివాసితులకు ప్రయోజనం చేకూర్చే "అద్భుతమైన ఆవిష్కరణ"గా పేర్కొన్నారు.
2023లో ప్రారంభించిన ఈ యాప్ లో 50వేల మందికి పైగా యాక్టివల్ కస్టమర్లు ఉన్నారని ఓ గోల్డ్ ఛైర్మన్ బందర్ అల్-ఓత్మాన్ తెలిపారు. ప్రజలు బంగారంపై నిరంతరం పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని అన్నారు. ప్రతి సంవత్సరం, అనేక దేశాలు వారి ఫియట్ కరెన్సీతో సమస్య ఎదుర్కొంటున్నాయని, కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను 50 శాతం తగ్గించాయని, అయితే బంగారం ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోందని, గత ఏడాది మాత్రమే ధర 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని లీజుకు ఇస్తుంటాయని, సాధారణ ప్రజలు కూడా ఇలాగే చేయడానికి ఈ యాప్ వారికి అవకాశం కల్పిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







