యూఏఈలో గోల్డ్ కొనుగోలు, లీజింగ్ కోసం కొత్త యాప్..!!
- February 27, 2025
యూఏఈ: యూఏఈ బేస్డ్ యాప్.. నివాసితులు బంగారాన్ని Dh1 కంటే తక్కువకు కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. కొనుగోలుదారులు తమ బంగారాన్ని లీజుకు ఇచ్చి, దాని నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని అందించే కొత్త సేవను ప్రారంభించింది. O గోల్డ్ యాప్ దాని వినియోగదారులను కేవలం 0.1 గ్రాముల బంగారాన్ని లీజుకు తీసుకోవడానికి, వారు కలిగి ఉన్న బంగారం నుండి 16 శాతం వార్షిక ఆదాయాన్ని పొందేందుకు అనుమతిస్తుంది. ఈ అవకాశాన్ని అందించడానికి గోల్డ్ లీజింగ్ మానిటరీ మెటల్స్ (MM)లో గ్లోబల్ లీడర్తో యాప్ ఒప్పందం చేసుకుంది. MM-దుబాయ్ సీఈఓ మార్క్ పే దీనిని యూఏఈ నివాసితులకు ప్రయోజనం చేకూర్చే "అద్భుతమైన ఆవిష్కరణ"గా పేర్కొన్నారు.
2023లో ప్రారంభించిన ఈ యాప్ లో 50వేల మందికి పైగా యాక్టివల్ కస్టమర్లు ఉన్నారని ఓ గోల్డ్ ఛైర్మన్ బందర్ అల్-ఓత్మాన్ తెలిపారు. ప్రజలు బంగారంపై నిరంతరం పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అని అన్నారు. ప్రతి సంవత్సరం, అనేక దేశాలు వారి ఫియట్ కరెన్సీతో సమస్య ఎదుర్కొంటున్నాయని, కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను 50 శాతం తగ్గించాయని, అయితే బంగారం ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోందని, గత ఏడాది మాత్రమే ధర 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని లీజుకు ఇస్తుంటాయని, సాధారణ ప్రజలు కూడా ఇలాగే చేయడానికి ఈ యాప్ వారికి అవకాశం కల్పిస్తోందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







