రమదాన్.. హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- February 27, 2025
మనామా: బహ్రెయిన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ను ప్రారంభించినట్లు సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పండుగ రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది. రమదాన్ మొదటి రోజు నుండి సందర్శకులకు అనుమతిస్తారు. పవిత్ర మాసం 18వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
దేశీయ పర్యాటకాన్ని పెంచుతూ బహ్రెయిన్ ప్రామాణిక సంప్రదాయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సందర్శకులను ప్రతిరోజూ 8:30 PM నుండి 1:00 AM వరకు అనుమతిస్తారు. "అల్ ముసాహెర్", "గెర్గావ్" ,"అల్ విదా", "డాక్ అల్ హబ్" వంటి రమదాన్ ఆచారాలను జరుపుకునే సాంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయన్నారు. హెరిటేజ్ విలేజ్ స్థానిక దుకాణాలు, కేఫ్లు, ఫుడ్ స్టాల్స్తో పూర్తి సాంప్రదాయ మార్కెట్ను కూడా నిర్వహిస్తుందని, సందర్శకులకు రమదాన్ నేపథ్యంలో ప్రామాణికమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







