రమదాన్.. హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- February 27, 2025
మనామా: బహ్రెయిన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ను ప్రారంభించినట్లు సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పండుగ రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది. రమదాన్ మొదటి రోజు నుండి సందర్శకులకు అనుమతిస్తారు. పవిత్ర మాసం 18వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
దేశీయ పర్యాటకాన్ని పెంచుతూ బహ్రెయిన్ ప్రామాణిక సంప్రదాయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సందర్శకులను ప్రతిరోజూ 8:30 PM నుండి 1:00 AM వరకు అనుమతిస్తారు. "అల్ ముసాహెర్", "గెర్గావ్" ,"అల్ విదా", "డాక్ అల్ హబ్" వంటి రమదాన్ ఆచారాలను జరుపుకునే సాంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయన్నారు. హెరిటేజ్ విలేజ్ స్థానిక దుకాణాలు, కేఫ్లు, ఫుడ్ స్టాల్స్తో పూర్తి సాంప్రదాయ మార్కెట్ను కూడా నిర్వహిస్తుందని, సందర్శకులకు రమదాన్ నేపథ్యంలో ప్రామాణికమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







