రమదాన్.. హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- February 27, 2025
మనామా: బహ్రెయిన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ను ప్రారంభించినట్లు సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పండుగ రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో జరుగుతుంది. రమదాన్ మొదటి రోజు నుండి సందర్శకులకు అనుమతిస్తారు. పవిత్ర మాసం 18వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
దేశీయ పర్యాటకాన్ని పెంచుతూ బహ్రెయిన్ ప్రామాణిక సంప్రదాయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సందర్శకులను ప్రతిరోజూ 8:30 PM నుండి 1:00 AM వరకు అనుమతిస్తారు. "అల్ ముసాహెర్", "గెర్గావ్" ,"అల్ విదా", "డాక్ అల్ హబ్" వంటి రమదాన్ ఆచారాలను జరుపుకునే సాంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయన్నారు. హెరిటేజ్ విలేజ్ స్థానిక దుకాణాలు, కేఫ్లు, ఫుడ్ స్టాల్స్తో పూర్తి సాంప్రదాయ మార్కెట్ను కూడా నిర్వహిస్తుందని, సందర్శకులకు రమదాన్ నేపథ్యంలో ప్రామాణికమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









