తెలంగాణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త
- March 03, 2025
తెలంగాణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు.రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రాసిన లేఖకు ఆయన స్పందిస్తూ తాజాగా ఒక లేఖ విడుదల చేశారు.
రాష్ట్రం పంపిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ (IDTR) ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సమాధానమిస్తూ.. 2.5 కోట్ల జనాభాకు ఒక ఐడీటీఆర్కు మాత్రమే అర్హత కలిగి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కరీంనగర్లో ఐడీటీఆర్ పనిచేస్తోందని కేంద్రమంత్రి స్పష్టంచేశారు.
మూడు ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(RDTCS), ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం (DTS) కోసం తెలంగాణ అర్హత సాధించినదని శుభవార్త వెల్లడించారు. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపొచ్చని బదులిచ్చారు. ఆటోమేటిక్ స్టేషన్లకు కేంద్రం 30శాతం గ్రాంట్ అందిస్తుందని, జిల్లాకు రూ.1.50 కోట్లు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం









