ఒమన్ లో ప్రభుత్వ సేవలకు యూనిఫైడ్ పోర్టల్.. కీలక ముందడుగు..!!
- March 04, 2025
మస్కట్: "ప్రభుత్వ సేవల కోసం యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ పోర్టల్"ను ప్రారంభించాలనే చొరవ ప్రభుత్వ సేవలను అందించేందుకు, డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఒక కీలక ముందడుగు పడింది. పౌరులు, నివాసితులు ఇద్దరికీ సేవలందించే యూనిఫైడ్ డిజిటల్ అవుట్లెట్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందేందుకు, లావాదేవీలను వేగవంతం చేయడానికి ఈ చొరవ సహాయపడుతుందని రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రి (నేషనల్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ సూపర్వైజర్ జనరల్) ఇంజనీర్ సాయిద్ హమౌద్ అల్ మావాలి తెలిపారు. యూనిఫైడ్ పోర్టల్ ప్రారంభం ప్రభుత్వ సేవలను పునర్నిర్మించడానికి, వాటిని మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం వ్యూహాత్మక విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రభుత్వ సేవల కోసం పోర్టల్ యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుందని అల్ మావాలి తెలిపారు. ఈ పోర్టు లబ్ధిదారులకు సమగ్ర అనుభవాన్ని అందిస్తుందని, మంత్రిత్వ శాఖల పోర్టల్లు, వెబ్సైట్ల మధ్య నావిగేట్ చేయకుండానే ప్రభుత్వ సమాచారం, సేవలను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!







