టీచర్ ఎమ్మెల్సీ పోరులో విజేతలు వీరే.. ...
- March 04, 2025
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిచారు. ఇక ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ అభ్యర్థులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్ల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.ఇక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఫలితాలు రావాల్సి ఉంది.
గత నెల 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు పోటీపడ్డ విషయం తెలిసిందే. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ, గుంటూరు ఏసీ కాలేజీలో కౌంటింగ్ జరిగింది.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొత్తం 9 రౌండ్లకు ఇవాళ తెల్లవారుజామున నాటికి చివరి రౌండ్ పూర్తయ్యేలోపు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 50 శాతానికి పైగా ఆయన ఓట్లు పొందడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ప్రతి రౌండులోనూ ఆలపాటి దూకుడు ప్రదర్శించడం గమనార్హం.
ఇక గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేసిన స్థానంలో మేజిక్ ఫిగర్ 10,068 ఓట్లు. ఆయనకు అంతకంటే ఎక్కువగా 12,035 ఓట్లు దక్కాయి.
మరోవైపు, గోదావరి జిల్లాల గ్రాడ్యేయేట్ ఎన్నికల్లో కూటమి నుంచి అభ్యర్థిగా దిగిన పేరాబత్తుల రాజశేఖరం ముందంజలో దూసుకెళ్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల రాఘవులుపై కొన్ని వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









