తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ విడుదల..
- March 09, 2025
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. ఢిల్లీ నుంచి ఫోనులో రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ సమాలోచనలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్. చివరకు ఇవాళ అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది.
కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమై గంటన్నర పాటు చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వారిద్దరు ఫోనులో మాట్లాడారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం