తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ విడుదల..
- March 09, 2025
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరించింది. ఢిల్లీ నుంచి ఫోనులో రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ సమాలోచనలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్. చివరకు ఇవాళ అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అభ్యర్థులను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో సీపీఐ అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేయనున్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ కార్యవర్గ సమావేశం జరుగుతోంది.
కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమై గంటన్నర పాటు చర్చించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో వారిద్దరు ఫోనులో మాట్లాడారు.
తాజా వార్తలు
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!







