గద్దర్ అవార్డుల పై ప్రభుత్వం కీలక ప్రకటన
- March 11, 2025
హైదరాబాద్: గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండు రోజుల్లో గద్దర్ అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ లో గద్దర్ అవార్డులను కళాకారులకు అందజేస్తామని ప్రకటించింది. కళాకారులను, వాగ్దేయకారులను తమ ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గద్దర్ అవార్డులను సినీ కళాకారులకు ఇవ్వాలని సంకల్పించిందని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పురస్కారాలకు సంబంధించిన విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి, ఆమోదం తెలిపారు.త్వరలోనే అవార్డులకు చెందిన పూర్తి వివరాలను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఉగాది రోజున ప్రదానం చేసేందుకు నిర్ణయించినప్పటికీ.. పురస్కారాల కోసం వచ్చిన చిత్రాలను ఎంపిక చేయడానికి 30 రోజుల సమయం అయినా పడుతుందని ఎఫ్డీసీ...ముఖ్యమంత్రికి తెలియజేసినట్టు తెలుస్తోంది. వీటి ఎంపిక ప్రక్రియ పూర్తయి..వాటిని ప్రభుత్వానికి పంపి ఆమోద ముద్ర వేయించడానికి నెలరోజుల కంటే ఎక్కువ సమయమే పట్టనుండగా.. రానున్న ఉగాదికి అవార్డుల ప్రదానోత్సవం లేనట్టే అని తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా వేడుక
తొలిసారి నిర్వహిస్తున్న గద్దర్ అవార్డుల ఉత్సవం కావడం, తెలంగాణ ప్రభుత్వం వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంది. దిల్ రాజు ఉండడం వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా అవార్డుల ఫంక్షన్లో కనిపించడం గ్యారంటీగా కనిపిస్తోంది.ఈ వేడుకను ఎప్పుడు, ఎక్కడ అనేవి ఇతరత్రా వివరాలతో నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏ ఏడాదికి అవార్డులు ఇస్తారు? ఏ టైమ్ పీరియడ్ సినిమాలు తీసుకుంటారు? అన్నీ తెలిసిన తర్వాత వీటిపై మరింత స్పష్టత రానుంది.
తాజా వార్తలు
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
- వీసా ఫీజులను పెంచిన జపాన్ ..భారతీయుల పై పడనున్న భారం!
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం







