యూఏఈలో 30శాతం అధిక జీతాలను డిమాండ్ చేస్తున్న ఉద్యోగార్థులు..!!
- March 11, 2025
యూఏఈ: యూఏఈలో ఉద్యోగార్థులు 30శాతం అధిక జీతాలను డిమాండ్ చేస్తున్నారని ఒక నివేదిక పేర్కొంది. దేశంలో జీవన వ్యయం పెరుగుతున్నందున యూఏఈలో కొత్త ఉద్యోగులు అధిక జీతాలను డిమాండ్ చేస్తున్నారు. తాజా నౌక్రిగల్ఫ్ హైరింగ్ అవుట్లుక్ నివేదిక ప్రకారం.. ఉద్యోగార్థులు సాధారణంగా యజమానులు అందించడానికి ఇష్టపడే దానికంటే 15-30 శాతం ఎక్కువ అడుగుతున్నారు. యూఏఈలో జీవన వ్యయం, ముఖ్యంగా గృహనిర్మాణం, విద్య ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న నేపథ్యంలో అధిక జీతాల డిమాండ్ వస్తుందని అధ్యయనం తెలిపింది.
యూఏఈ గత నాలుగు సంవత్సరాలలో జనాభాలో పెద్ద పెరుగుదలను నమోదు చేసింది. దీని వలన అద్దెలు, పాఠశాల ఫీజులు, రవాణా ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. వరల్డ్మీటర్స్ ప్రకారం.. గల్ఫ్ దేశ జనాభా 2021లో 9.789 మిలియన్ల నుండి 2025లో 11.346 మిలియన్లకు పెరిగింది. అయితే, యూఏఈ గల్ఫ్ ఉద్యోగ మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగార్ధుల పెరుగుదల కనిపిస్తోందని నౌక్రిగల్ఫ్ వెల్లడించింది.
నౌక్రిగల్ఫ్ ప్రకారం.. నైపుణ్యం ఆధారిత ఉద్యోగాలలో ప్రతిభ గల వారు లేకపోవడం వల్ల అధిక జీతాలు డిమాండ్ క్రమంగా పెరుగుతుందని నిపుణులు తెలిపారు. ఉదాహరణకు, ఐటీ, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, AI నిపుణులు సగటు కంటే 25 నుండి 50 శాతం ఎక్కువ వేతనాన్ని ఆశిస్తున్నారు. అదేవిధంగా సాస్, ఫిన్టెక్ వంటి అధిక వృద్ధి చెందుతున్న రంగాలలోని సేల్స్, మార్కెటింగ్ నిపుణులు వారి ప్రత్యేక నైపుణ్య సెట్ల కారణంగా ప్రామాణిక మార్కెట్ రేట్ల కంటే 20 నుండి 30 శాతం ఎక్కువ జీతాలను డిమాండ్ నెలకొన్నది.
యూఏఈలో 85 శాతం యజమానులు రాబోయే ఆరు నెలల్లో నియామకాలను చేపట్టాలని యోచిస్తుండగా, ఏడు శాతం మంది ఉద్యోగాలను తగ్గించవచ్చని సర్వే గుర్తించింది.
యూఏఈలోని కొన్ని రంగాలు ఇంజనీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్ వంటి నైపుణ్యం ఆధారిత ప్రతిభ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇవి నియామక డిమాండ్లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయని హైరింగ్ అవుట్లుక్ నివేదిక తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, AI, క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్-స్టాక్ డెవలప్మెంట్లో నిపుణులకు డిమాండ్ పెరుగుతుండడంతో, సాంకేతికత ఆధారిత పాత్రలు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







