తెలంగాణ: ఆర్ఎంపీలకు మెడికల్ కౌన్సిల్ వార్నింగ్
- March 12, 2025
హైదరాబాద్: ఓవైపు అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నా, ఇంకా కొందరు ఆర్ఎంపీలు తీరు మార్చుకోవడం లేదని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ వైద్యమండలి చైర్మన్ డా. మహేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని, దుండిగల్, బాచుపల్లి, సంగారెడ్డి, వనస్థలిపురం, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి ఆయా పోలీస్ స్టేషన్ ఫరిధిలో కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో చాలామంది డాక్టర్ల దగ్గర టెక్నీషియన్లు, నర్సులుగా పనిచేసి సమాజంలో డాక్టర్స్ గా చలామణి అవుతున్నారని, వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







