ఎగుమతిదారులను హెచ్చరించిన భారత కాన్సులేట్ జనరల్..!!
- March 14, 2025
యూఏఈ: దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఆధారిత కంపెనీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని భారత మంత్రిత్వ శాఖ ఎగుమతిదారులను హెచ్చరించిందని పేర్కొంది. దుబాయ్లోని భారత మిషన్ వారు అలాంటి ప్రకటన జారీ చేయలేదని స్పష్టం చేసింది. జ్యూరిస్ అవర్ అనే వెబ్సైట్లో ప్రచురించబడిన కథనాన్ని తొలగించాలని కోరింది. పత్రికా ప్రకటనలు కాన్సులేట్ అధికారిక పోర్టల్లో మాత్రమే హోస్ట్ చేయబడతాయని భారత మిషన్ పాఠకులకు గుర్తు చేసింది.
"కొన్ని యూఏఈ ఆధారిత కంపెనీలు.. ముఖ్యంగా ఆహార పదార్థాలు, సాధారణ వాణిజ్య రంగాలలో" మోసపూరిత కార్యకలాపాలు, అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నాయని, దీనితో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేయవలసి వచ్చిందని పేర్కొంది. "భారత ఎగుమతిదారులు, అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాముల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా" ఫ్లాగ్ చేయబడిన కంపెనీల పేర్లు కూడా జాబితా చేయబడ్డాయని, మరింత సమాచారం కోసం భారత ఎగుమతిదారులు యూఏఈలోని భారత మిషన్లతో సంప్రదించాలని తెలిపారు.
దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఎటువంటి పత్రికా ప్రకటన జారీ చేయలేదని వెల్లడించిన అనంతరం, సదరు వెబ్సైట్ "నకిలీ సర్క్యులర్" గురించి హెచ్చరించడానికి తన కథనాన్ని అప్డేట్ చేసింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!