వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- March 15, 2025
యూఏఈ: ఇప్పటివరకు దాదాపు 2,400 జంటలు వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్నారు. వీరిలో 92% అనుకూలంగా ఉన్నట్లు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఆయన అధ్యక్షత ప్రారంభమైన ఎమిరేట్స్ జీనోమ్ కౌన్సిల్ సమావేశం నవజాత జన్యు పరీక్షల కోసం కార్యక్రమాలను ఆమోదించింది. యూఏఈ జీనోమ్ ప్రోగ్రామ్లో పెద్దలకు విస్తరించిన జన్యు పరీక్ష, సంతానోత్పత్తి, గుండె సంబంధిత జన్యు పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రీమేరిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ను జనవరి 1, 2025 నుండి ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ ఇతర భాగస్వాముల సహకారంతో అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 2,428 జంటలకు పరీక్షలు చేయించింది. 840 కంటే ఎక్కువ జన్యు రుగ్మతలతో ముడిపడి ఉన్న 570 జన్యువుల సమగ్ర జన్యు పరీక్ష ద్వారా 92 శాతం కంటే ఎక్కువ జన్యుపరంగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించింది.
వంశపారంపర్య వ్యాధుల నుండి రక్షించడం, కుటుంబ నియంత్రణలో సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి జన్యు డేటాను ఉపయోగించుకునేలా జంటలకు మేలు చేయడంతోపాటు రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించడం ఈ కార్యక్రమం లక్ష్యమని వెల్లడించారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







