జనవరి 8 నుంచి ఇండియన్ స్కూల్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- January 05, 2017మస్కట్: మస్కట్లోని ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 8న ప్రారంభం కానుంది. కెజి నుంచి 9వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు ఉంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ ఈ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పేరెంట్స్కి, అలాగే స్కూల్స్కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇండియన్ స్కూల్ మస్కట్, ఇండియన్ స్కూల్ దర్సైత్, ఇండియన్ స్కూల్ వాడి కబిర్, ఇండియన్ స్కూల్ గుబ్రా, ఇండియన్ స్కూల్ సీబ్, ఇండియన్ స్కూల్ మయీబెలా తదిర స్కూళ్ళకు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ని అందుబాటులోకి తెచ్చారు. ఫిబ్రవరి 15తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆన్లైన్ ద్వారా పూర్తి చేసిన అప్లికేషన్ని, అవసరమైన డాక్యమెంట్లతోపాటు పైన పేర్కొనబడిన ఆరు స్కూళ్ళలో ఏదో ఒక దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వెబ్సైట్లోనూ పేరెంట్స్కి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..