రూ 2.5 లక్షల లోపు డిపాజిట్లను ప్రశ్నించం: సీబీడీటీ
- February 07, 2017ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా రూ.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి గురించి ఆరా తీస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్లను ఆపి ఉంచడం జరుగుతుందని అన్నారు. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తంచామని చంద్ర తెలిపారు. పన్ను పరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చే విధంగా రూ.10 లక్షల పై చిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదని, అటువంటి వారిని వదిలివేస్తామని, అయితే మూడేళ్ళలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుడా ఉంటే వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..