గాయపడ్డ సెక్యూరిటీ ఆఫీసర్స్ని పరామర్శించిన క్రౌన్ ప్రిన్స్
- June 25, 2017మక్కా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్, ఓ ఆపరేషన్లో గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రిలో పరామర్శించారు. మక్కాలోని గ్రాండ్ మాస్క్ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడటం జరిగింది. ప్రిన్స్ మొహమ్మద్, గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బందితోపాటు, విదేశీ యాత్రీకుల్ని సైతం పరామర్శించారు. ఓ తీవ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. భద్రతా సిబ్బంది త్యాగాలు వృధా పోవనీ, దేశమంతా భద్రతా దళాల వెంట ఉంటుందని ప్రిన్స్ మొహమ్మద్ చెప్పారు. ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు ప్రిన్స్ మొహమ్మద్. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సౌద్ నైఫ్, కమాండర్ ఆఫ్ స్పెషల్ ఎమర్జన్సీ ఫోర్సెస్ లెఫ్టినెంట్ జనరల్ ఖాలిద్ బిన్ ఖరార్ అల్ హర్బి పలువురు అధికారులు క్రౌన్ ప్రిన్స్ వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!