ఆషాడ శుక్ల ఏకాదశి విశిష్టత !
- July 03, 2017ఆషాడ శుక్ల ఏకాదశిని 'తొలి ఏకాదశి' అని అంటారు. ఈరోజు నుంచి నాలుగు నెలలు చాతుర్మాసం మొదలు అవుతుంది. ఈ పవిత్ర సమయంలో భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే శుభ ప్రధమని పురాణాలు చెపుతున్నాయి.
ఈ వ్రతాన్ని ఎంత నియమ నిష్టలతో ఆరాధిస్తే అంత మంచిదని అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. ఈ వ్రత ప్రాముఖ్యాన్ని గౌతమ బుద్ధుడు అనుభవ పూర్వకంగా తెలియచేసాదని జాతక కథలు వెల్లడిస్తాయి. ఈ నాలుగు నెలలు శ్రీమహావిష్ణువు క్షీరాబ్ది పై యోగ నిద్రలో ఉండటం వల్ల నదులకు ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అని అంటారు.
ఈ కాలంలో వంటలను నిలిపివేసి ఎక్కువగా ఉపవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే కాలంలో వచ్చే వ్యాస పూర్ణిమ 'గురు పౌర్ణమి' గా సమాదరణ పొందుతుంది. ఈ కాలంలో శ్రద్ధతో వేద పురుష పఠనాలు దైవాభిషేకం మిత భాషణ మిత భోజనం చేస్తారు. ఈ కాలంలో భూత దయతో అన్న జల గోదానాలతో కాలం సద్వినియోగం చేసుకోవడమే కాకుండా పర నింద చేయకుండా కాలం గడపాలని పెద్దలు సూచిస్తారు.
యోగ నిద్రలో ఉండే శ్రీమహావిష్ణువు ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తుల యోగ ముద్రలు ఎంతో సహకరిస్తాయి. ఈ కాలంలో చేసే యోగ సాధన మనకు మంచి ఫలితాలు ఇస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. మన హిందూమత సాంప్రదాయానికి సంబంధించి తొలి పండుగగా భావించే ఈ 'తొలి ఏకాదశి' రోజున వైష్ణవ ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి.
యోగ సాధనతోనే భగవంతుడి సాక్షాత్కారం లభిస్తుంది అన్న విషయాన్ని తెలియచేసే రోజుగా ఈ తొలి ఏకాదశి రోజును భావిస్తూ మన పాపాల విముక్తి కోసం శ్రీమహావిష్ణువు ని ఆరాధించడం అన్నిటికి శుభ సూచికం..
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు