దక్షిణాఫ్రికా లోని మనుషుల్ని తిని అలసిపోయిన నరమాంస భక్షకుడు
- August 23, 2017మనిషి ని మనిషి చంపుకొని తినే స్థాయి నుంచి మానవుడు నాగరికత నేర్చాడు.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల నర మాంస భక్షకులు ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.. తాజాగా ఓ నరమాంస భక్షకుడు తాను మనుషుల్ని తిని తిని అలసిపోయాను.. ఇక మనుషులను తినలేను అని పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తాను లొంగిపోతూ.. పోలీసులకు ఓ మనిషి కాలు, చేతిని కూడా అప్పగించి వారికి షాక్ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా లోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా పలువురు కనిపించకుండా పోతున్నారు. దీంతో చాలా మంది తమ వాళ్ళు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ ప్లేస్ లో కుండ దానినిండా మానవ అవయవాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. ఇటీవల ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి దారుణంగా చంపేసి.. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆపై.. ఆమె మృతదేహంలోని అవయవాలను ఆ ముగ్గురు వ్యక్తులు తినేశారు.. ఈ విషయం పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.. కాగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తాను మనుషులను తిని అలసిపోయాను అని స్వయంగా పోలీసులకు లొంగిపోవడం తో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.. మిగిన ఇద్దరు నర మాంస భక్షకుల కోసం వెదుకుతున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు