ఇండికేటర్స్ వినియోగించకపోవడం కూడా ఉల్లంఘనే
- October 12, 2017మస్కట్: వాహనదారుడు తన వాహనాన్ని నడుపుతున్న సమయంలో కుడి వైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలనుకుంటే, సంబంధిత ఇండికేటర్స్ వినియోగించాలనీ, అలా వినియోగించకపోవడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని రాయలఠ్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడితే 15 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వెళుతూ అకస్మాత్తుగా లేన్లు మారిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయనీ, ఇండికేటర్లను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు దారి తీస్తున్నందున, ఇతర వాహనాలను గౌరవించి వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇండికేటర్స్ తప్పనిసరిగా వాడాలనీ, బ్రేక్ లైట్ సహా వాహనంలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు