దుబాయ్ పాఠశాలలో అగ్నిప్రమాదం : 2,200 మంది విద్యార్థులను క్షేమంగా ఖాళీ చేయించారు
- October 12, 2017దుబాయ్: దుబాయ్ లోని ఘర్హౌడ్ ప్రాంతంలోని అల్ ఖలీజ్ నేషనల్ స్కూల్లో ఒక ప్రాథమిక కళా తరగతి గదిలో గురువారం ( నేడు ) ఉదయం 11.50 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న 2,200 మంది విద్యార్థులను ఖాళీ చేయించారు.. దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఐదు నిమిషాల వ్యవధిలో పాఠశాలకు చేరుకున్నాయి. అగ్నిమాపక నియంత్రణ జట్టు ఎగిసిపడుతున్న మంటలను మధ్యాహ్నం 12.20 గంటలకు ఆర్పివేయగలిగేరు. అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం , మొట్టమొదటి అంతస్తులో పైకప్పుకు సమీపంలో ఉన్న ఒక ఎయిర్ కండిషన్డ్ నుండి పొగను గమనించామని వారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. , దుబాయ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పరిస్థితిని నియంత్రించిందని, విద్యార్థులు మరియు టీచింగ్ అధ్యాపకులు వెంటనే ఆవరణ నుండి ఖాళీ చేయించారు మరియు వారివరకు ఎటువంటి గాయాలూ లేవని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష