మటన్ పెప్పర్ రోస్ట్
- October 14, 2017కావాల్సిన పదార్థాలు
(మొదటి దశ)
మటన్ : అరకిలో
పసుపు : అర స్పూను
చెక్కా లవంగాలు : ఐదు
యాలకులు : నాలుగు
ఉప్పు : తగినంత
నీళ్లు : సరిపడేన్ని
(రెండో దశ)
ఉల్లి తరుగు : ఒక కప్పు
టొమోటో : రెండు (తరుగు)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు
పచ్చిమిరపకాయలు : ఆరు (తరుగు)
ధనియాల పొడి : ఒక స్పూను
కారంపొడి : రెండు స్పూన్లు
మిరియాల పొడి : మూడు స్పూన్లు
మెంతులు : అరస్పూను
కొత్తిమీర : (అరకప్పు తరుగు)
ఉప్పు : తగినంత
నూనె : నాలుగు స్పూన్లు
ఎలా చేయాలి?
మటన్తో పాటు (మొదటి దశ) పైన చెప్పిన వాటన్నిటినీ వేసి.. కాసిన్ని నీళ్లు పోసి.. ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
కారంపొడి, ధనియాలపొడి, అన్ని దినుసులతో కలిపి మసాలా పేస్టును మిక్సీ ఆడించి సిద్ధం చేసుకోవాలి.
పాన్లో నూనె పోసి.. ఉల్లి తరుగును బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. పాన్లోకి మళ్లీ ఆయిల్ పోసి.. అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చి వాసనపోయే వరకు వేగించాలి. సిద్ధం చేసుకున్న మసాలా పేస్టును అందులో వేయాలి. ఆ తరువాత కట్ చేసుకున్న టొమోటోలు, పచ్చిమిర్చి ముక్కలు మగ్గే వరకు వేయించాలి. అందులో మిరియాల పొడిని చల్లి బాగా కలపాలి. కరివేపాకు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇది వరకే వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లి తరుగును కలపాలి. ఆఖర్న ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ను అందులో వేసి.. కుక్కర్ మూత పెట్టి పది నిమిషాలు మంట మీదే ఉంచాలి. నీళ్లు ఇమిరిపోయి నూనె తేలిన తరువాత దించేస్తే సరి.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..