రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి
- October 21, 2017షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని 42 ఏళ్ళ జోర్డానియన్ నడుపుతున్నారు. ఆ కారులో మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో రక్తమోడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ చేరుకున్నాయని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రష్దియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులేమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?