నైజీరియాలో ముగ్గురు మహిళల ఆత్మాహుతి దాడి
- October 23, 2017నైజీరియాలో ముష్కరులు పేట్రేగిపోయారు. ముగ్గురు మహిళా దళ సభ్యులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. మైదుగురి నగరంలోని ఓ రెస్టారెంట్ ఎదుట ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు ఓ మహిళ తనను తాను పేల్చేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చివేసుకున్నారు. ఆహారం కోసం రెస్టారెంట్ వద్ద పలువురు వేచిఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా రక్తసిక్తమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. బొకోహరం ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ