ఒమన్, యూఏఈల్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ ట్రిప్
- October 23, 2017మస్కట్: జనవరి 18 నుంచి 26 వరకు యూఏఈ, ఒమన్లలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ నిర్వహించనుంది. ఈ వాహనాల పట్ల అందరిలోనూ చైతన్యం తెచ్చేందుకు ఈ రోడ్ ట్రిప్ని నిర్వహించనున్నారు. అబుదాబీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ జనవరి 18న అబుదాబీలోని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మిఇ రోజులపాటు ఒమన్ మరియు యూఏఈలలో జరిగే ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. అల్ అయిన్ వద్ద ఒమన్లో ఈ ర్యాలీ ప్రవేశించి, ఇబ్రి ద్వారా మస్కట్ చేరుకుంటుంది. ఖతమత్ మలాహా బోర్డర్ ద్వారా దేశం నుంచి బయటకు వెళుతుంది. ఫుజారియా, రస్ అల్ ఖైమా ద్వారా ప్రయాణించి దుబాయ్లో ఈ రోడ్ ట్రిప్ ముగుస్తుంది. తొమ్మిదిరోజులపాటు సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ