రైలు ఏసీ-1, ఏసీ -2 టికెట్ కన్ఫమ్ కాకపోతే విమానంలో వెళ్లే అవకాశం...
- October 23, 2017రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ-1, ఏసీ -2 వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫమ్ కాకపోతే ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణికులను విమానంలో పంపించాలని యోచిస్తున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు. రాజధాని రైళ్లలో ప్రయాణికుల రద్దీ వల్ల ఏసీ -2 టికెట్లు కన్ ఫమ్ కావడం లేదని అలాంటి వారిని విమానాల్లో పంపించి విమానాల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చూస్తామని అశ్వనీ పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉండి కన్ ఫమ్ కాని రాజధాని ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాలు ఎయిర్ ఇండియాకు పంపిస్తామని వారు ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే వారిని వారి గమ్యస్థానాల్లో దింపేలా చూస్తామన్నారు. ఈ ప్రతిపాదనను ఎయిర్ ఇండియాకు పంపించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు. రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ చేసిన ప్రతిపాదనపై తాను ఇప్పుడే మాట్లాడనని, ఎందుకంటే రైల్వేకు, విమాన చార్జీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు