నైపుణ్యంగల వికలాంగులను ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేస్తున్న సౌదీ మంత్రిత్వ శాఖ
- October 27, 2017వికలాంగులకు అండగా నిలిచి వారిని ఆర్ధికంగా బలోపేతం చేస్తామని సౌదీ మంత్రిత్వ శాఖ భరోసా ఇస్తోంది. కార్మిక మార్కెట్ లో వికలాంగులకు నైపుణ్యంగల, ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేసేందుకు అల్-ఇరా సొసైటీతో సౌదీ మంత్రిత్వ శాఖ బుధవారం ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంతకాల కార్యక్రమం లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ సహాయ కార్యదర్శి ఇబ్రహీం అల్ షాబీ, అల్-ఇరా సొసైటీ బోర్డు ఛైర్మన్ అమర్ బౌకాస్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రి అలీ అల్-ఘఫీస్ సమక్షంలో సౌదీ రాజధాని రియాద్ లో సంతకం చేసింది. ఈ అవగాహన ఒప్పంద సమయంలో మంత్రిత్వ శాఖ. స్థానిక శ్రామికుల మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వివిధ వైకల్యాలతో బాధ పడుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులను స్పాన్సర్ చేసి, వారికి శిక్షణ అందచేస్తారు. .ప్రైవేటులో వికలాంగులకు ప్రతిభావంతులైన వ్యక్తులను సమర్ధించే మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమంలో ఈ ఒప్పందంలో అమలు చేయనున్నారు. వికలాంగులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించే విధానాలు, నిబంధనలు, విధానాలు మరియు అధికార యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. మంత్రిత్వ శాఖ చట్టాలు మరియు శాసనాలు మరియు వైకల్యాలున్న వ్యక్తుల తరఫున వృత్తి భద్రతలను అమలు చేయడం ద్వారా వికలాంగులకు సమాన అవకాశాలను మరియు విస్తృతమైన ఉపాధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు