రిస్క్ చేసిన బన్నీ
- November 26, 2017వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఇప్పుడా సీన్స్ అద్భుతంగా వచ్చాయని దర్శకుడు వంశీ మురిసిపోతున్నాడు. ఇదంతా బన్నీ క్రెడిట్ నే అంటున్నాడు. ఎందుకంటే.. ఆ యాక్షన్ ఏపీసోడ్స్ చాలా రిస్క్ తో కూడుకొన్నవి అట. వాటిని బన్నీ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. వాటిని తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి గురవుతారని చెప్పుకొంటున్నాడు.
దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అను నేను' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో స్టయిలీష్ స్టార్, సూపర్ స్టార్ ల బాక్సీఫీసు ఫైట్ ని ఆరోజు చూడొచ్చన్న మాట.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల