హైదరాబాద్లో ఇవాంకా..గ్రాండ్ వెల్కమ్
- November 27, 2017అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్హౌస్ సలహాదారు ఇవాంకా హైదరాబాద్కి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీకానున్నారు.
అలాగే ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకుంటారు.
అక్కడ మోదీని ఇవాంక మర్యాదపూర్వకంగా కలుస్తారు. పారిశ్రామికవేత్తల సదస్సు తర్వాత ఇద్దరూ కలిసి ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్కు చేరుకుంటారు. ఇవాంకా రాక సందర్భంగా హైటెక్ సిటీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు