చంద్రుడిపై రోబో స్టేషన్ నిర్మించనున్న చైనా.!
- December 06, 2017చంద్రుడి భౌగోళిక స్వరూపంపై పరిశోధనలను మరింత వేగవంతం, విస్తృతం చేసే దిశగా చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిశోధనలకు అనుగుణంగా చందమామపై రోబో స్టేషన్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చంద్రమండలం నుంచి శిలల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు అవుతున్న భారీ వ్యయాన్ని ఈ స్టేషన్ ఏర్పాటుతో గణనీయంగా తగ్గించవచ్చునని చైనా భావిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థ బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. రోబో స్టేషన్లో పెద్ద సౌరవిద్యుత్తు ఉత్పత్తి యంత్రాన్ని ఏర్పాటుచేస్తారని.. ఫలితంగా చంద్రుడిపై ఇప్పుడున్న రోవర్ల కంటే రోబోల శక్తి సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని తెలిపింది. సంక్లిష్ట పరిశోధనలను సైతం వేగంగా పూర్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మరోవైపు, అంగారక గ్రహంపై పరిశోధనలకుగాను 2020 లోగా 'లాంగ్మార్చ్ 5' ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ రోవర్ను చైనా అంగారకుడిపై మోహరిస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ