21న కాకినాడలో ఎ.ఆర్.రెహమాన్ లైవ్ కాన్సర్ట్
- December 17, 2017ఆంధ్రప్రదేశ్ టూరిజానికి కొత్త పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పర్యాటకలను ఆకర్షించేలా జాతీయ స్థాయి ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియా అవార్డుల వేడుకను నిర్వహించిన టూరిజం శాఖ.. ఈ నెలలో కాకినాడలో రెహమాన్ కాన్సర్ట్ను ఏర్పాటు చేసింది. టూరిజంలో ఆంధ్రప్రదేశ్కు అందిపుచ్చుకున్నన్ని అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం... ఆ దిశగా పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుంటోంది. కొత్త టూరిజం పాలసీతో పెట్టుబడిదార్లను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీని టూరిజం శాఖ సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
దేశవిదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈవెంట్లను నిర్వహించేందుకు టూరిజం శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. కొద్ది రోజుల క్రితం అమరావతిలో సోషల్ మీడియా అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించింది. దీపికా పదకొనేలాంటి సూపర్ స్టార్తో పాటు అనేక మంది సినీతారలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సోషల్ మీడియా అవార్డులనే కాన్సెప్టే కొత్తది కావడం... దీపికా పదకొనే రావడంతో ఈ కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ... విశాఖ ఉత్సవ్ లాంటి వాటిని నిర్వహించారు. ఈ కోవలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. ఈ ఈవెంట్ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. పైగా ప్రజలందరూ ఉచితంగా ఈ కాన్సర్ట్ను ఆస్వాదించే ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించి... టూరిజం శాఖ నిర్వహించే ఈవెంట్లను ఓ బ్రాండ్ తెచ్చేలా ప్రయత్నాలు చేయనున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!