బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు ఓటమి
- December 17, 2017బ్యాడ్మింటన్లో మరో టైటిల్ ముద్దాడాలన్న తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠగా సాగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమి పాలయ్యింది. 94 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-15, 12-21, 19-21 తేడాతో సింధు పోరాడి ఓడింది. సింధు-యమగూచి మధ్య జరిగిన ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. 21-15తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది సింధు. అయితే, రెండో గేమ్ను 12-21తో ప్రత్యర్థి కైవసం చేసుకుని సింధుకు సవాల్ విసిరింది. దీంతో టైటిల్ గెలవాలంటే మూడో గేమ్లో గెలుపు తప్పనిసరి. అందరి దృష్టి మూడో గేమ్పైనే. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. స్కోరు 19-19 వచ్చే వరకు స్కోర్లు చాలా దగ్గరగా వచ్చాయి. చివర్లో ఒత్తిడిని జయిస్తూ యమగూచి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో విజయం ఆమెను వరించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాదే తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్ సిరీస్లో అడుగిడిన సింధు. అప్పట్లో సెమీస్ దశను దాటలేకపోయింది. ఈ సారి ఆ దశను దాటినప్పటికీ కీలకమైన టైటిల్ పోరులో వెనకబడిపోయింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..