వెబ్ సైట్ లకు గూగుల్ హెచ్చరిక.!
- December 17, 2017ఇటీవల కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న అసత్య వార్తలకు(ఫేక్ న్యూస్) అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చర్యలు ప్రారంభించింది. నెటిజన్లను తప్పుదోవ పట్టించే అలాంటి వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ఫేక్ న్యూస్ అందించే వెబ్సైట్లను న్యూస్ వెబ్సైట్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. వెబ్సైట్కు సంబంధించిన యజమాని వివరాలు, దేశం, నెటిజన్లను తప్పుదోవ పట్టించడం ఇలా ఏ చర్యకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. నెటిజన్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సౌకర్యవంతంగా చదువుకునేలా వార్తలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది. 'మీకోసం మిమ్మల్ని మీరు తప్పుగా చూపించుకోవద్దు. వెబ్సైట్లు గూగుల్ న్యూస్తో సహా ఎవర్నీ తప్పుగా చూపించవద్దు. తప్పులు, యాజమాని వివరాలు గోప్యంగా ఉంచడం, నెటిజన్లను తప్పుదోవ పట్టించేలా చేయటం, ఒక దేశంలో ఉండి మరో దేశంలో ఉన్నట్లు కంప్యూటర్ ఐపీలను చూపించటం ఇక సహించం' అని గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు