ఎన్ఆర్ఐలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కేసీఆర్
- December 17, 2017హైదరాబాద్: చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని సీఎం కేసీఆర్ వివరించారు. ఎన్ఆర్ఐలకు ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో..ఇపుడు అదేవిధంగా తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లు వెల్లడించారు. పథకాల అమలులో సంక్షేమరంగంలో దేశంలోనే నంబర్వన్గా నిలిచామన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!