ఇండియానాలో కూలిన విమానం, ముగ్గురు మృతి
- December 17, 2017విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో జరిగింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్లోని ఫ్రెడరిక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా చనిపోయింది. మరో శునకం అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడింది.
ఆ శునకాన్ని పోలీసు అధికారులు దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానానికి ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..