రొయ్యల కిచిడీ
- January 15, 2018కావల్సినవి: శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు, పసుపు - అరచెంచా, సాంబార్ పొడి - చెంచా, పచ్చిమిర్చి తరుగు - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, కొబ్బరితురుము - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, బియ్యం - రెండుకప్పులు, నానబెట్టిన పెసరపప్పు - టేబుల్స్పూను, మినప్పప్పు - టేబుల్స్పూను(నానబెట్టుకోవాలి), నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు.
తయారీ: కుక్కర్ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ