రొయ్యల కిచిడీ
- January 15, 2018
కావల్సినవి: శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు, పసుపు - అరచెంచా, సాంబార్ పొడి - చెంచా, పచ్చిమిర్చి తరుగు - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, కొబ్బరితురుము - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, బియ్యం - రెండుకప్పులు, నానబెట్టిన పెసరపప్పు - టేబుల్స్పూను, మినప్పప్పు - టేబుల్స్పూను(నానబెట్టుకోవాలి), నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు.
తయారీ: కుక్కర్ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









