రొయ్యల కిచిడీ
- January 15, 2018
కావల్సినవి: శుభ్రం చేసి, కారం, ఉప్పు పట్టించిన రొయ్యలు - కప్పు, పసుపు - అరచెంచా, సాంబార్ పొడి - చెంచా, పచ్చిమిర్చి తరుగు - చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, టొమాటో, బంగాళాదుంప - ఒక్కోటి చొప్పున, కొబ్బరితురుము - రెండు చెంచాలు, ఉల్లిపాయలు - రెండు, బియ్యం - రెండుకప్పులు, నానబెట్టిన పెసరపప్పు - టేబుల్స్పూను, మినప్పప్పు - టేబుల్స్పూను(నానబెట్టుకోవాలి), నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు.
తయారీ: కుక్కర్ని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక పచ్చిమిర్చి తరుగూ, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ, కొబ్బరితురుమూ, బంగాళాదుంప ముక్కలూ, రొయ్యలు వేయాలి. రొయ్యలు కొద్దిగా వేగాయనుకున్నాక కడిగిన బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, తగినంత ఉప్పూ, పసుపూ, సాంబార్పొడి, నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే చాలు.
తాజా వార్తలు
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు









