బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 ప్రారంభం
- January 18, 2018మనామా: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషావ్ు బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ఖలీఫా, బహ్రెయిన్ ఆటో ఫెయిర్ 2018 (బిఎఎఫ్)ని ప్రారంభించారు. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్లో ఈ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. సోలిడ్ విజన్, ఎలెవన్ అండ్ బ్రిడ్జ్తో కలిసి 20,000 చదరపు మీటర్ల వైశాల్యంలో, మనామా గుండెకాయ లాంటి ప్రాంతంలో ఈ ఈవెంట్ని నిర్వహిస్తోంది. బహ్రెయిన్ షాపింగ్ ఫెస్టివల్తోపాటుగా ఈ ఈవెంట్ జరుగుతోంది. జిసిసి దేశాల నుంచి వివిధ ఏజ్ గ్రూప్స్కి చెందినవారు సుమారుగా 40,000 మంది సందర్శకులు ఈ ఈవెంట్కి వస్తారని అంచనా వేస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ దైజ్ అల్ ఖలీఫా, క్యాపిటల్ గవర్నరేట్ సహకారాన్ని అభినందించారు. టెస్ట్ డ్రైవ్ ఏరియా సహా, అనేక ఆకర్షణలు ఈ ఆటో షో ప్రత్యేకతలు. వివిధ రకాలైన కార్లు, ముఖ్యంగా లగ్జరీ కార్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. క్లాసిక్ ఎక్సోటిక్స్తోపాటు మోటర్ బైక్స్, మాడిఫైడ్ కార్స్ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. కార్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. జనవరి 21తో ఈ ఈవెంట్ ముగియనుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు