ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా
- February 12, 201828 ఏళ్ళ క్రితం శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, అమల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటి దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకుంటారనేది వాస్తవం. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగడం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పవచ్చు. విమర్శకులు సైతం ఈ సినిమాని పొగడకుండా ఉండలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారట. ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్లో ‘శివ’ సినిమా ప్రదర్శన జరుపుకోనుండగా, ఈ స్పెషల్ షోకు నాగార్జునతో పాటు అమల, దర్శకుడు వర్మ , నాగ్, వర్మ ఫ్యాన్స్ హాజరౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్, వర్మ కాంబినేషన్లో కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ సినిమా ప్రమోషన్కి ఉపయోగపడేలా శివ సినిమా స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఓన్ బ్యానర్ కంపెనీపై కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ముంబై మోడల్ మైరా సరీన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సమ్మర్ కానుకగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ