ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ను ఉగ్రవాదిగా గుర్తించిన పాక్
- February 13, 2018ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ టార్గెట్గా భారత్ తెస్తున్న ఒత్తిడి ఫలించింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఆంక్షలు తప్పవనే సూచనలతో పాపి దిగొచ్చింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈమేరకు యాంటి టెర్రరిజమ్ యాక్ట్ సవరణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్పై పాక్ అధ్యక్షుడు హుస్సేన్ సంతకం చేశాడు. దీంతో.. హఫీజ్ సయీద్పైనే కాదు.. ఐక్యరాజ్య సమితి గుర్తించి ముష్కర మూకలన్నింటిపైనా వేటు పడింది.
జమాతుద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు చీఫ్గా ఉన్నాడు.. హఫీజ్ సయీద్. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఇన్నాళ్లు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దశాబ్దాలుగా హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వాల్ని కీలుబొమ్మగా చేసి ఆడుకుంటున్న హఫీజ్.. పార్లమెంట్కు పోటీ చేసి.. సర్కార్లో భాగస్వామి కావాలనే భారీ స్కెచ్తో ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో ఉగ్రవాదంపై పాకిస్తాన్ని ఏకాకిగా మార్చగలిగింది.. భారత్. పాపికి అండగా నిలిచే అన్ని దేశాలతోను ఏదో రూపంలో సంప్రదింపులు జరిపింది. మోడీ గల్ఫ్ టూర్లోను టెక్నాలజీని అభివృద్ధి కోసం వాడుకోవాలి గానీ.. విధ్వంసాలకు కాదంటూ మోడీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్