అమెరికా డ్రోన్ దాడుల్లో గూగుల్కూ పాత్ర
- March 08, 2018వాషింగ్టన్ : అమెరికా అక్రమంగా సాగిస్తున్న డ్రోన్ దాడుల కార్యక్రమంలో తాము కూడా సహకరించామని గూగుల్ అంగీకరించింది. ఆ దాడుల లక్ష్యాలను గుర్తించడానికి అవసరమైన సాఫ్ట్వేర్ను తాము అందించామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ స్పష్టం చేసింది. 2009లో అమెరికా డ్రోన్ దాడి కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుండి దాదాపు 3వేల మందిని హతమార్చినట్లు అమెరికా చెప్పుకుంటోంది. డ్రోణ్ దాడిలో లక్ష్యమైన ఒక వ్యక్తితో పాటు 9మంది పక్కవారు కూడా మరణించారని అంతర్గత సైనిక పత్రాల్లో వెల్లడవుతోంది. అంటే దీన్నిబట్టి యెమెన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్ల్లో అమెరికా సైన్యం సాగించిన తీవ్రవాద దాడుల్లో మృతుల సంఖ్య వేల సంఖ్యలోనే వుందని వెల్లడవుతోంది. డ్రోణ్ దాడుల కార్యక్రమంలో గూగుల్ పాత్ర వుండడంతో అమెరికా సైన్యం నేరపూరిత కార్యకలాపాల్లో కూడా దానికి భాగమున్నట్లు స్ఫష్టమైంది. గత వారం అంతర్గత మెమోలో గూగుల్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో గూగుల్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..