రజినీనైనా విమర్శించటానికి వెనుకాడను: కమల్
- March 13, 2018చెన్నై: రజినీ రాజకీయ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు సక్రమంగా లేకపోతే ఆయనను విమర్శించడానికి మొహమాటపడబోనని 'మక్కల్ నీతి మయ్యం' పార్టీ అధినేత కమల్హాసన్ స్పష్టం చేశారు. అయితే రజినీని రాజకీయంగానే విమర్శిస్తానని, వ్యక్తిగత విమర్శలకు దిగనని కమల్ తేల్చి చెప్పారు. ఓ తమిళ చానల్ ఏర్పాటు చేసిన వేడుకలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రజినీ రాకను ఆయన ఆహ్వానించారు. ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన సిద్ధాంతమని ఇప్పటికే ప్రకటించామని, రజినీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో చూద్దామని కమల్ వ్యాఖ్యానించారు. సిద్ధాంతపరంగా ఏవైనా విభేదాలొస్తే రజినీని విమర్శిస్తానని, అది తమ పార్టీ హుందాతనమని ఆయన తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు సరైనవి కాకపోతే ఏ పార్టీని విమర్శించడానికీ వెనకాడబోనని కమల్హాసన్ స్పష్టం చేశారు. రజినీకాంత్ కూడా రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలకు సేవ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నటనలో ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న వీరిద్దరూ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారోనన్న ఉత్కంఠ తమిళ ప్రజల్లో నెలకొంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు